ETV Bharat / state

ప్రొద్దుటూరులో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

author img

By

Published : Mar 8, 2021, 3:00 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ప్రవీణ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా... వైకాపా శేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

fight between  tdp, ysrcp leaders at kadapa district
fight between tdp, ysrcp leaders at kadapa district

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. పట్టణంలోని నాల్గొవ వార్డుకు తెదేపా నుంచి సురేష్, వైకాపా నుంచి వరుకూటి ఒబులరెడ్డి పోటీలో ఉన్నారు. చివరిరోజు కావడంతో తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగో వార్డులో ప్రచారం నిర్వహించారు. వైకాపా కౌన్సిలర్ కార్యాలయం ముందు నుంచి తెదేపా శ్రేణులు వెళ్తుండగా.. వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

ఇదీ చదవండి: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. పట్టణంలోని నాల్గొవ వార్డుకు తెదేపా నుంచి సురేష్, వైకాపా నుంచి వరుకూటి ఒబులరెడ్డి పోటీలో ఉన్నారు. చివరిరోజు కావడంతో తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగో వార్డులో ప్రచారం నిర్వహించారు. వైకాపా కౌన్సిలర్ కార్యాలయం ముందు నుంచి తెదేపా శ్రేణులు వెళ్తుండగా.. వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

ఇదీ చదవండి: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.