ETV Bharat / state

రాష్ట్రంలో పరిస్థితులపై కిషన్ రెడ్డికి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు

author img

By

Published : Jul 17, 2020, 2:53 PM IST

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీజేవైఎం నాయకుడు శ్రావణ్ కుమార్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దాడుల గురించి ఆయనకు ఫిర్యాదు చేశారు.

ex minister adinarayanareddy meet kishna reddy
కిషన్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

ఏపీలో రాక్షస పాలన సాగుతోందంటూ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీజేవైఎం నాయుకుడు శ్రావణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. దిల్లీలో ఆయనను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల చేతిలో బొమ్మలా మారిపోయిన వైనాన్ని కిషన్​రెడ్డికి తెలిపారు. జస్టిస్ రామకృష్ణ, రామ్మోహన్, కోళ్ల నారాయణ తదితరులపై జరిగిన భౌతిక దాడులను వివరించారు. ఈ విషయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రాష్ట్ర హోంశాఖకు కూడా సూచనలు చేస్తానన్నట్లు చెప్పారు.

ఏపీలో రాక్షస పాలన సాగుతోందంటూ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీజేవైఎం నాయుకుడు శ్రావణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. దిల్లీలో ఆయనను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల చేతిలో బొమ్మలా మారిపోయిన వైనాన్ని కిషన్​రెడ్డికి తెలిపారు. జస్టిస్ రామకృష్ణ, రామ్మోహన్, కోళ్ల నారాయణ తదితరులపై జరిగిన భౌతిక దాడులను వివరించారు. ఈ విషయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రాష్ట్ర హోంశాఖకు కూడా సూచనలు చేస్తానన్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

కరోనా పాజిటీవ్​ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.