ETV Bharat / state

వివేక హత్యకేసులో.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి లకు సీబీఐ నోటీసులు

Vivekananda Reddy murder case: వివేకానందరెడ్డి హత్య కేసులో... వైఎస్ భాస్కర్‌రెడ్డితో పాటుగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి.. సీబీఐ నుంచి పిలుపు అందింది. ఈ నెల 23 భాస్కర్‌రెడ్డి, 24వ తేదీన అవినాష్‌రెడ్డి విచారణకు రావాలని కబురు పంపింది. ఈ మేరకు సీబీఐ నోటీసులు అవినాష్‌రెడ్డికి వాట్సప్ ద్వారా నోటీసులుపంపారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు గతనెల 28న మొదటిసారి ప్రశ్నించారు.

author img

By

Published : Feb 18, 2023, 8:13 PM IST

Updated : Feb 18, 2023, 9:16 PM IST

YS Avinash Reddy
ఎంపీ అవినాష్ రెడ్డి

CBI issued second notice to YS Avinash Reddy: వివేక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కడప ఎంపీకి అవినాష్ రెడ్డికిి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. గత నెల 28న తొలిసారిగా సీబీఐ ఎదుట హజరైన ఎంపీని..అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి. తనను మరోసారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటిసారి విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు రెండోసారి మరిన్ని విషయాల పైన విచారించే అవకాశం ఉంది.

అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, అదేవిధంగా సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డి మొబైల్స్ కు ఫోన్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. నవీన్, కృష్ణ మోహన్ రెడ్డిని కూడా ఈనెల మొదటి వారం కడపలో సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. మరోసారి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని తెలిపినట్లు తెలుస్తుంది. ఈ నెల 24న అవినాష్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు.. అధికారులు సమాయాత్తం అవుతున్నారు.

గత విచారణలో కొత్త విషయాలు: గత నెల 28న కడప ఎంపీ వైెఎస్​ అవినాశ్​రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన CBI ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసినట్లు సీబీఐ తన దర్యాప్తులో గుర్తించింది.

వైయస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు... సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌లను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా చేసుకొని.. కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా .. ఇంకెవరికైనా ఫోన్‌ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ప్రశ్నలు సంధించారు.

భాస్కర్‌రెడ్డికి నోటీసులు 23న విచారణకు రావాలన్న సీబీఐ: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ భాగంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి సైతం సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కడప లేదా హైదరాబాద్‌ ఎక్కడికి వస్తారో చెప్పాలని సీబీఐ అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రాలేనని వైఎస్ భాస్కర్‌రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తుంది. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు భాస్కర్‌రెడ్డికి తెలిపినట్లుగా సమాచారం.

ఇవీ చదవండి:

CBI issued second notice to YS Avinash Reddy: వివేక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కడప ఎంపీకి అవినాష్ రెడ్డికిి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. గత నెల 28న తొలిసారిగా సీబీఐ ఎదుట హజరైన ఎంపీని..అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి. తనను మరోసారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటిసారి విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు రెండోసారి మరిన్ని విషయాల పైన విచారించే అవకాశం ఉంది.

అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, అదేవిధంగా సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డి మొబైల్స్ కు ఫోన్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. నవీన్, కృష్ణ మోహన్ రెడ్డిని కూడా ఈనెల మొదటి వారం కడపలో సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. మరోసారి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని తెలిపినట్లు తెలుస్తుంది. ఈ నెల 24న అవినాష్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు.. అధికారులు సమాయాత్తం అవుతున్నారు.

గత విచారణలో కొత్త విషయాలు: గత నెల 28న కడప ఎంపీ వైెఎస్​ అవినాశ్​రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన CBI ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసినట్లు సీబీఐ తన దర్యాప్తులో గుర్తించింది.

వైయస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు... సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌లను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా చేసుకొని.. కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా .. ఇంకెవరికైనా ఫోన్‌ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ప్రశ్నలు సంధించారు.

భాస్కర్‌రెడ్డికి నోటీసులు 23న విచారణకు రావాలన్న సీబీఐ: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ భాగంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి సైతం సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కడప లేదా హైదరాబాద్‌ ఎక్కడికి వస్తారో చెప్పాలని సీబీఐ అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రాలేనని వైఎస్ భాస్కర్‌రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తుంది. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు భాస్కర్‌రెడ్డికి తెలిపినట్లుగా సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Feb 18, 2023, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.