ETV Bharat / state

వివేకా హత్య కేసు: కీలక వ్యక్తులను విచారించిన సీబీఐ

author img

By

Published : Apr 12, 2021, 12:32 PM IST

Updated : Apr 12, 2021, 7:21 PM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు గంగిరెడ్డిని అధికారులు విచారించారు.

cbi investigation on ys viveka murder case
పులివెందులలో వివేక హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో సీబీఐ వేగం పెంచింది. ఆరు నెలల తరువాత మూడో దఫా పులివెందులకు చేరుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం రాత్రి చేరుకున్న సీబీఐ బృందం.. ఇవాళ అర్​అండ్​బీ అతిథి గృహంలో పలువురుని విచారించింది. ఇవాళ ఉదయం వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదాయ్ తుల్లాను విచారించారు. వివేకా ఇంటిని 3 గంటల పాటు పరిశీలించిన సీబీఐ అధికారులు..హత్య జరిగిన పడకగది, స్నానపు గదిలో ఆధారాలు సేకరించారు.

2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన సమయంలో ఇంట్లో రక్తపు మరకలు తుడిచిన కేసులో ఎర్రగంగిరెడ్డిని మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ విచారణకు పిలిచారు. ఘటన జరిగిన రోజు ఎందుకు రక్తపు మరకలు తుడిచావనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరు చెబితే రక్తపు మరకలు తుడవాల్సి వచ్చింది వంటి ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. హిదాయ్ తుల్లాను కూడా అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో ఉదయం 6 గంటలకు వివేకా ఇంట్లో ఆయన కూడా ఉన్నారు. బాత్ రూంలో రక్తపు మడుగులో హత్యకు గురైన వివేకా మృతదేహాం ఫోటోలను మొబైల్ లో తీసింది హిదాయ్ తుల్లానే. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో సీబీఐ వేగం పెంచింది. ఆరు నెలల తరువాత మూడో దఫా పులివెందులకు చేరుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం రాత్రి చేరుకున్న సీబీఐ బృందం.. ఇవాళ అర్​అండ్​బీ అతిథి గృహంలో పలువురుని విచారించింది. ఇవాళ ఉదయం వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదాయ్ తుల్లాను విచారించారు. వివేకా ఇంటిని 3 గంటల పాటు పరిశీలించిన సీబీఐ అధికారులు..హత్య జరిగిన పడకగది, స్నానపు గదిలో ఆధారాలు సేకరించారు.

2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన సమయంలో ఇంట్లో రక్తపు మరకలు తుడిచిన కేసులో ఎర్రగంగిరెడ్డిని మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ విచారణకు పిలిచారు. ఘటన జరిగిన రోజు ఎందుకు రక్తపు మరకలు తుడిచావనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరు చెబితే రక్తపు మరకలు తుడవాల్సి వచ్చింది వంటి ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. హిదాయ్ తుల్లాను కూడా అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో ఉదయం 6 గంటలకు వివేకా ఇంట్లో ఆయన కూడా ఉన్నారు. బాత్ రూంలో రక్తపు మడుగులో హత్యకు గురైన వివేకా మృతదేహాం ఫోటోలను మొబైల్ లో తీసింది హిదాయ్ తుల్లానే. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

'విద్యుత్ ఛార్జీలు పెంచడమే వైకాపా రాజన్న రాజ్యమా?'

Last Updated : Apr 12, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.