ETV Bharat / state

జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు - RTC news in kadapa

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మైదుకూరులో తొలిదశలో ఐదు రూట్లలో 20 సర్వీసులు నడపనున్నారు.

Rtc
Rtc
author img

By

Published : May 20, 2020, 5:06 PM IST

ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఐదు రూట్లలో 20 సర్వీసులు నడపనున్నారు. మైదుకూరు- ప్రొద్దుటూరు మధ్య ఐదు బస్సులు, మైదుకూరు- పోరుమామిళ్ల మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - కడప మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - బ్రహ్మంగారిమఠం మధ్య ఒక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కండక్టర్ లేకుండానే సర్వీసులు నడుస్తాయి అన్నారు.

ఇదీ చదవండి: లాక్ డౌన్ ను అడ్డుపెట్టుకొని వైకాపా అవినీతికి పాల్పడింది

ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఐదు రూట్లలో 20 సర్వీసులు నడపనున్నారు. మైదుకూరు- ప్రొద్దుటూరు మధ్య ఐదు బస్సులు, మైదుకూరు- పోరుమామిళ్ల మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - కడప మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - బ్రహ్మంగారిమఠం మధ్య ఒక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కండక్టర్ లేకుండానే సర్వీసులు నడుస్తాయి అన్నారు.

ఇదీ చదవండి: లాక్ డౌన్ ను అడ్డుపెట్టుకొని వైకాపా అవినీతికి పాల్పడింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.