ETV Bharat / state

గణేశ్‌ విగ్రహ ఊరేగింపులో అపశ్రుతి... 8 మందికి గాయాలు

కడప జిల్లాలో గణేశ్ విగ్రహ ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. టపాసులు పేలి.. 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Sep 10, 2021, 12:18 AM IST

Updated : Sep 10, 2021, 1:13 AM IST

crackers
టపాసులు

కడప జిల్లాలో గణేశ్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న సందర్భంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి ఎనిమిది మంది గాయపడ్డారు.పెనగలూరు మండలం ఇండ్లూరు సాతపల్లెలో ఈ ఘటన జరిగింది.

వినాయక చవితి సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్వామివారి ప్రతిమను బాణసంచా పేల్చుతూ ట్రాక్టర్లో ఊరేగింపుగా తీసుకవచ్చారు. ఆ సమయంలో ఆరు మంది చిన్నారులు మరో ఇద్దరు పెద్దవాళ్లు ట్రాక్టర్​లోనే ఉన్నారు. ప్రమాదవశాత్తు కొన్ని నిప్పురవ్వలు ట్రాక్టర్లో పడడంతో... అందులోని బాణసంచా పేలింది. దీంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి, కడపకు తరలించారు.

కడప జిల్లాలో గణేశ్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న సందర్భంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి ఎనిమిది మంది గాయపడ్డారు.పెనగలూరు మండలం ఇండ్లూరు సాతపల్లెలో ఈ ఘటన జరిగింది.

వినాయక చవితి సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్వామివారి ప్రతిమను బాణసంచా పేల్చుతూ ట్రాక్టర్లో ఊరేగింపుగా తీసుకవచ్చారు. ఆ సమయంలో ఆరు మంది చిన్నారులు మరో ఇద్దరు పెద్దవాళ్లు ట్రాక్టర్​లోనే ఉన్నారు. ప్రమాదవశాత్తు కొన్ని నిప్పురవ్వలు ట్రాక్టర్లో పడడంతో... అందులోని బాణసంచా పేలింది. దీంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి, కడపకు తరలించారు.

ఇదీ చదవండి

GOVERNOR, CM WISHES: 'ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలి'

Last Updated : Sep 10, 2021, 1:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.