ఇళ్ల స్థలాల సేకరణలో ఉద్రిక్తత.. గ్రామస్థులు-పోలీసుల మధ్య తోపులాట
By
Published : Mar 2, 2020, 6:24 PM IST
పదిహేను ఏళ్ల కిందట ఇచ్చిన ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవటాన్ని పశ్చిమగోదావరి జిల్లా ముక్కంపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది. కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాక్టర్ సాయంతో గుడిసెలు కూల్చివేస్తుండగా గ్రామస్థులు వాహనాలకు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోగా...ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులతో గొడవపడుతున్న గ్రామస్థులు
.
ఇళ్ల స్థలాల సేకరణలో ఉద్రిక్తత.. గ్రామస్థులు-పోలీసుల మధ్య తోపులాట