పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమాగుటూరులో గ్రామ వాలంటీర్ కె.మాధురి(25) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి కాస్త ముందే మాధురి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలో ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. మృతురాలికి ఆరు నెలల పాప ఉంది. ఘటనపై ఆమె భర్త నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి