పాకలో కట్టేసిన దున్నపోతును గుర్తుతెలియని వ్యక్తులు చంపి, చర్మం ఒలిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా గొల్లగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన జెట్టి కనకారావు అనే రైతు తన తోటలోని పాకలో పశువులను కట్టేస్తుంటాడు. రైతు పాక వద్దకు వెళ్లి శుభ్రం చేస్తుండగా దున్నపోతు కనిపించకపోవడంతో పరిసరాల్లో వెతికారు. గుర్తు తెలియని వ్యక్తులు దున్నపోతును అపహరించి దానిని చంపి... మాంసం తీసుకొని చర్మం, కాళ్లు ఇతర వ్యర్థాలను వదిలేశారు. దగ్గరలో దాని అవశేషాలు కనిపించడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి.. వారు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి. రేకులు పడి వ్యక్తి మృతి