పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మద్ది రావమ్మ, మహాలక్ష్మమ్మ, అంకమ్మ తల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠను కన్నులపండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు హోమం జరిపి... అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు నీటితో దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: