ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు...కాలువలో పడి వ్యక్తి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు.

author img

By

Published : Oct 5, 2020, 11:41 AM IST

కారు, ద్విచక్రవాహనం ఢీ... వ్యక్తి మృతి
కారు, ద్విచక్రవాహనం ఢీ... వ్యక్తి మృతి


పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తాంబాద్​కు చెందిన కొప్పినీడీ పురుషోత్తం(45) పాలకొల్లు వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. అదే సమయంలో పాలకొల్లు నుంచి నరసాపురం వైపు వస్తున్న కారు అదుపుతప్పి ద్విచక్రవాహనం​ను బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న పురషోత్తం పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయాడు. అతని తలకు బలంగా తగలడంతో కాలువలో పడి ఊపిరాడక మృతి చెందాడు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని పురుషోత్తం మృతదేహన్ని వెలికితీశారు. పురుషోత్తం కుమారుడు కోప్పినీడీ దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తాంబాద్​కు చెందిన కొప్పినీడీ పురుషోత్తం(45) పాలకొల్లు వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. అదే సమయంలో పాలకొల్లు నుంచి నరసాపురం వైపు వస్తున్న కారు అదుపుతప్పి ద్విచక్రవాహనం​ను బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న పురషోత్తం పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయాడు. అతని తలకు బలంగా తగలడంతో కాలువలో పడి ఊపిరాడక మృతి చెందాడు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని పురుషోత్తం మృతదేహన్ని వెలికితీశారు. పురుషోత్తం కుమారుడు కోప్పినీడీ దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండి

అమానుషం: అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.