ETV Bharat / state

పెరవలి ఎస్​ఐ ఓవరాక్షన్​పై డీజీపీ ఆగ్రహం​..సస్పెన్షన్​ వేటు

author img

By

Published : Mar 27, 2020, 10:31 AM IST

Updated : Mar 27, 2020, 10:53 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో యువకుడిపై లాఠీఛార్జ్​​ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్​ఐ సస్పెన్షన్​కు గురయ్యాడు. ఈ ఎస్సై వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి వెళ్లింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

peravali si suspended
యువకుడిపై లాఠీచార్జ్​... ఎస్​ఐపై సస్పెన్షన్​ వేటు
యువకుడిపై లాఠీఛార్జ్​... ఎస్​ఐపై సస్పెన్షన్​ వేటు

యువకుడిపై నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్​ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తండ్రీ కుమారుడు సహా ఓ వృద్ధురాలిపైనా ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ లాఠీఛార్జ్ చేశాడు. లాఠీఛార్జ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో... యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎస్సై వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి వెళ్లింది. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​కు పంపించాలి తప్ప.. దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

యువకుడిపై లాఠీఛార్జ్​... ఎస్​ఐపై సస్పెన్షన్​ వేటు

యువకుడిపై నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్​ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తండ్రీ కుమారుడు సహా ఓ వృద్ధురాలిపైనా ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ లాఠీఛార్జ్ చేశాడు. లాఠీఛార్జ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో... యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎస్సై వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి వెళ్లింది. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​కు పంపించాలి తప్ప.. దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

Last Updated : Mar 27, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.