ETV Bharat / state

ఎన్నికల నియమావళిని పట్టించుకోని అధికారులు

author img

By

Published : Jan 27, 2021, 9:01 AM IST

పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పంచాయతీల్లో నిబంధనలు అమలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అడుగడుగున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లోని అధికారులు నిబంధనలను అమలు చేసే పనుల్లో మునిగి తేలుతుంటే.. చాలా ప్రాంతాల్లో తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

Officials ignoring election rules in West Godavari district
ఎన్నికల నియమావళిని పట్టించుకోని అధికారులు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఎన్నికలు జరిగే పంచాయతీల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి. పార్టీ నాయకుల విగ్రహాలు కనిపించకుండా ముసుగులు వేయాలి.

ఎలక్షన్ కోడ్​ను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పరిధిలోని అధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు వంటి ప్రాంతాల్లో చాలాచోట్ల.. ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఎన్నికలు జరిగే పంచాయతీల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి. పార్టీ నాయకుల విగ్రహాలు కనిపించకుండా ముసుగులు వేయాలి.

ఎలక్షన్ కోడ్​ను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పరిధిలోని అధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు వంటి ప్రాంతాల్లో చాలాచోట్ల.. ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.

ఇదీ చదవండి:

వానరాల ఆకలి తీర్చిన ఎస్సై రవికుమార్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.