ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలింపు

author img

By

Published : Apr 23, 2020, 7:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరు మండలం చుక్కలొద్ది గ్రామంలో ఆదివాసుల మరణాలపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథానికి అధికారులు స్పందించారు. హుటాహుటిన గ్రామంలో అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు.

officers respond to etv Bharat story about tribal  died in west godavari dst
officers respond to etv Bharat story about tribal died in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామంలో ఆదివాసీల అకాలమరణాల పై ఈటీవీ భారత్, ఈనాడు కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్న కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్న ఆదివాసీలను సమీపంలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో దొరికే వాగులో నీరు ప్రజలు తాగనీయకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ట్యాంకర్ ద్వారా శుద్ధి నీటిని అందజేశారు. ఆదివాసీల గూడెంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ద్వారా బోరును వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గిరిజనులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామంలో ఆదివాసీల అకాలమరణాల పై ఈటీవీ భారత్, ఈనాడు కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్న కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్న ఆదివాసీలను సమీపంలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో దొరికే వాగులో నీరు ప్రజలు తాగనీయకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ట్యాంకర్ ద్వారా శుద్ధి నీటిని అందజేశారు. ఆదివాసీల గూడెంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ద్వారా బోరును వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గిరిజనులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

ఇదీ చూడండి:

ఆ 2 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో 60 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.