ETV Bharat / state

'ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదు'

author img

By

Published : May 21, 2020, 8:49 PM IST

ఇసుక మాఫియాని ఆరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చింతలపూడి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్, పంచాయతీ అధికారులతో సమావేశమయ్యారు.

mla yelija counduct  meeting on sand mafiya
ఇసుక అక్రమ రవాణా నివారణపై ఎమ్మెల్యే సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్, పంచాయతీ అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నా అనేక మంది అక్రమార్కులు డీడీలు తియ్యకుండా దొంగచాటుగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలో కొన్ని పంచాయతీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే రెవెన్యూ పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అధికారులను ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్, పంచాయతీ అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నా అనేక మంది అక్రమార్కులు డీడీలు తియ్యకుండా దొంగచాటుగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలో కొన్ని పంచాయతీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే రెవెన్యూ పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి...

ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులా..?:పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.