పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఓ వివాహం ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం (ఈ నెల 9వ తేదీ) సాయంత్రం వీచిన ఈదురు గాలులకు రేకులు పడి కనకరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు మండలం వంకాయ గూడెంకి చెందిన ఆయన... కైకరంలోని తన మరదలు వివాహానికి వచ్చాడు. ఈ క్రమంలో కైకరం పంచాయతీ పరిధిలోని వెంకటకృష్ణాపురం రహదారి వైపు వెళ్తుండగా... పక్కనే ఉన్న షెడ్డుపై రేకులు ఈదురు గాలులకు ఎగిరి కనకరాజుపై పడ్డాయి. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లారితే వివాహం అనగా కనకరాజు మృతిచెందడం వల్ల ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: పోలవరం పనుల బాటలో వలస కూలీలు