పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల, నరసాపురంలో కూరగాయల దుకాణాల్లో అమ్మకాలు నియమిత సమయాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా మాంసం దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించడంలేదు. ఆదివారం సంత నేపథ్యంలో అమ్మకాలకు అధికారులు అనుమతించారు. దుకాణాల వద్ద క్యూ పద్ధతిలో దూరాన్ని పాటించేలా నిర్వాహకులు బాధ్యత వహించాలని ఆదేశించారు. కొనుగోలు దారులు అవేవీ పట్టించుకోకుండా ఆయా దుకాణాల వద్ద గుమిగూడారు. నరసాపురం చేపల మార్కెట్లో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం.. విమర్శలకు తావిచ్చింది.
ఇదీ చదవండి: