పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. డివిజన్ పరిధిలో రైతు భరోసా రాని రైతులకు తమ భూమి తాలూకా వివరాలు తీసుకురావాలని చెప్పటంతో ఐదు మండలాల నుంచి ఆర్డీవో కార్యాలయానికి అన్నదాతలు పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కార్యాలయానికి తాళాలు వేశారు. దీనిపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమకు రుణ మాఫీ సక్రమంగానే పడ్డాయని, వాలంటీర్లకు అవగాహన లేకపోవటం వల్ల నేడు తమకు పాట్లు తప్పడం లేదని రైతులు వాపోయారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు సాయంత్రం వరకూ రైతుల పత్రాలు పరిశీలించారు.
ఇదీ చూడండి: