ETV Bharat / state

ఇసుక కొరత.. కూలీల ఉపాధికి గండి

ఇసుక కొరతతో కూలీల ఉపాధికి గండిపడింది. తాపీ మేస్త్రీల నుంచి పెయింటర్ల వరకూ 32 విభాగాల వారు పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. చేతిలో రూపాయి కూడా లేక పేదకూలీలు విలవిల్లాడుతున్నారు. నెలసరి ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారి దుర్భరంగా బతుకులీడుస్తున్నారు.

author img

By

Published : Jul 24, 2019, 9:02 AM IST

day-workers-trouble-for-sand-issues
ఇసుక కొరతతో కూలీల ఉపాధికి గండి

వ్యవసాయం తర్వాత ఎక్కువమంది కూలీలు ఆధారపడిన నిర్మాణ రంగం ఇసుక కొరతతో అల్లాడిపోతుంది. ఇసుకపై నిషేధం విధించాక... ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో.. భవన నిర్మాణాలను యజమానులు నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో 11 ఇసుక ర్యాంపులు 45 రోజులుగా మూతపడ్డాయి. వాగులు, వంకల నుంచి తీసుకొచ్చే ఇసుకపై కూడా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండా పోయింది. నెలన్నర రోజులుగా ఉపాధి లేక పస్తులుంటున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క భవన నిర్మాణ రంగంపైనే 32 విభాగాల కార్మికులు ఆధారపడి ఉపాధి పొందుతారు. ఇటుక, కంకర తయారీ కూలీలు, తాపీమేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, గ్రానైట్‌ పనివారు ఇలా లక్షల మందికి నిర్మాణ రంగం ఉపాధినిస్తోంది. పల్లెల్లో పనులు లేకుంటే.. వ్యవసాయ కూలీలు సైతం సమీపంలోని పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు కుదిరేవారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం దెబ్బతినగా.. నిర్మాణ రంగంలోనూ పని లేని పరిస్థితి నెలకొంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కొరత కారణంగా దాదాపు 15వందల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు నిలిచిపోయాయి. సిమెంటు, ఇనుము, గృహోపకరణాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అవసరమైన ఇసుక అధికారుల అనుమతితో రవాణా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొత్త ఇసుక విధానం అమలయ్యే వరకూ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.

ఇసుక కొరతతో కూలీల ఉపాధికి గండి

వ్యవసాయం తర్వాత ఎక్కువమంది కూలీలు ఆధారపడిన నిర్మాణ రంగం ఇసుక కొరతతో అల్లాడిపోతుంది. ఇసుకపై నిషేధం విధించాక... ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో.. భవన నిర్మాణాలను యజమానులు నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో 11 ఇసుక ర్యాంపులు 45 రోజులుగా మూతపడ్డాయి. వాగులు, వంకల నుంచి తీసుకొచ్చే ఇసుకపై కూడా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండా పోయింది. నెలన్నర రోజులుగా ఉపాధి లేక పస్తులుంటున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క భవన నిర్మాణ రంగంపైనే 32 విభాగాల కార్మికులు ఆధారపడి ఉపాధి పొందుతారు. ఇటుక, కంకర తయారీ కూలీలు, తాపీమేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, గ్రానైట్‌ పనివారు ఇలా లక్షల మందికి నిర్మాణ రంగం ఉపాధినిస్తోంది. పల్లెల్లో పనులు లేకుంటే.. వ్యవసాయ కూలీలు సైతం సమీపంలోని పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు కుదిరేవారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం దెబ్బతినగా.. నిర్మాణ రంగంలోనూ పని లేని పరిస్థితి నెలకొంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కొరత కారణంగా దాదాపు 15వందల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు నిలిచిపోయాయి. సిమెంటు, ఇనుము, గృహోపకరణాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అవసరమైన ఇసుక అధికారుల అనుమతితో రవాణా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొత్త ఇసుక విధానం అమలయ్యే వరకూ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.

Intro:చిత్తూరు జిల్లా వంగర మండలం గౌరీశంకర్ పురం గ్రామంలోని ని ప్రజల బ్రతుకులు బూడిద మయంగా మారుతోంది గ్రామానికి అంత దూరం లోని న్యూ దిల్ కర్మాగారం ఉంది కర్మాగారం నుంచి బూడిద వృధా నీరు ఈ గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది గ్రామం చుట్టుపక్క లోని వ్యవసాయ పంట పొలాలు కలుషిత నీటి వలన ఎండిపోతున్నాయి కర్మాగారం నుంచి వచ్చే బూడిద ప్రజల కళ్లలో పడి ఇబ్బందులకు గురి చేస్తుంది కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు గతంలో కూడా గ్రామస్తులు చెబుతున్నారు ఈ విషయమై గత సోమవారం గ్రామస్తులు జిల్లా పాలనాధికారి ని కలిసి విన్నవించడం జరిగింది పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేశారు అయినా పట్టించుకోవడం లేదని 40 కుటుంబాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈనాడు ఈటీవి ఆధ్వర్యంలో లో ప్రజల బతుకులు బూడిద అన్న అంశంపై


Body:s.gurunath


Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.