ETV Bharat / state

బంఫర్ ఆఫర్​ అని పీచు మిఠాయి పంపిన సైబర్ కేటుగాళ్లు - latest cyber crime cases in vijayawada

రాబోయే పండుగలను ఆసరాగా మార్చకుంటున్నారు..సైబర్​ నేరగాళ్లు. ఆఫర్ల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల మెుబైల్​ లను ఇస్తామని ఆశ చూపి...చివరికి పీచు మిఠాయి పంపి పిచ్చి వాళ్లను చేస్తున్నారు.

సైబర్ కేటుగాళ్లు
సైబర్ కేటుగాళ్లు
author img

By

Published : Oct 10, 2020, 6:38 PM IST

Updated : Oct 10, 2020, 9:35 PM IST

దసరా , దీపావళి పండుగలు అనగానే సంబరాలతో పాటు భారీ ఆఫర్లు ప్రజలను ఊరిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా మార్చుకున్నారు సైబర్ నేరగాళ్లు. రానున్న ఈ పండుగలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల మెుబైల్​ లను అందిస్తామని నమ్మించి దోచుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏకంగా ఒకే రోజు ఐదుగురికి సెల్​ఫోన్ బదులు పీచు మిఠాయి పంపి మోసగించారు.

అదే ప్రాంతానికి చెందిన లారీ చోదకుడు దొరబాబు కి 2 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కేవలం 1700 రూపాయలకి ప్రముఖ కంపెనీ ఫోన్ ఇస్తామని చెప్పడంతో అడ్రస్ చెపాడు. తపాలా కార్యాలయం లో నగదు చెల్లించి బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఫోన్ కు బదులు పీచు మిఠాయి కనబడటంతో బాధితుడు లబోదిబో అన్నాడు. ఒకేరోజు ఐదుగురు మోసపోవడం తో తపాలా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి సైబర్ మోసగాళ్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దసరా , దీపావళి పండుగలు అనగానే సంబరాలతో పాటు భారీ ఆఫర్లు ప్రజలను ఊరిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా మార్చుకున్నారు సైబర్ నేరగాళ్లు. రానున్న ఈ పండుగలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల మెుబైల్​ లను అందిస్తామని నమ్మించి దోచుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏకంగా ఒకే రోజు ఐదుగురికి సెల్​ఫోన్ బదులు పీచు మిఠాయి పంపి మోసగించారు.

అదే ప్రాంతానికి చెందిన లారీ చోదకుడు దొరబాబు కి 2 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కేవలం 1700 రూపాయలకి ప్రముఖ కంపెనీ ఫోన్ ఇస్తామని చెప్పడంతో అడ్రస్ చెపాడు. తపాలా కార్యాలయం లో నగదు చెల్లించి బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఫోన్ కు బదులు పీచు మిఠాయి కనబడటంతో బాధితుడు లబోదిబో అన్నాడు. ఒకేరోజు ఐదుగురు మోసపోవడం తో తపాలా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి సైబర్ మోసగాళ్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

Last Updated : Oct 10, 2020, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.