గోదావరి-కృష్ణా...కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ... జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసిందని, ఈ నదుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 5 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు లభిస్తుందని మంత్రి షెకావత్ తెలిపారు. ఎంపీలు టీజీ వెంకటేష్ , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీకి తొలివిడతగా రూ.151 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి : గోదావరి-కృష్ణా అనుసంధానం@60 వేల కోట్లు!