లాక్డౌన్ అనంతరం విజయనగరం జిల్లాలో బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్లో ఉన్న వలసదారులకు, ప్రయాణికులకు రాత్రి 10 గంటల సమయంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం వారికి భోజనాలను అందించారు.
ఇదీ చదవండి: సింహాల మధ్య సింపుల్గా బిడ్డకు జన్మనిచ్చింది!