భోగాపురం మండలం జాతీయ రహదారిపై గత 15 రోజుల కిందట పోలీసులకు చిక్కిన వాహనంలో సుమారు పది టన్నుల పీడీఎస్ బియ్యం లభించింది. చుట్టుప్రక్కల గ్రామాల్లో సేకరించి…. విజయనగరం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది.
ఆ బియ్యం ఎండకు ఎండి, వానకు తడుస్తూ స్టేషన్ ఆవరణలో పడిగాపులు కాస్తుంది. ప్రభుత్వ పథకం కావడంతో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు పంపిణీ చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ విషయానికి సంబంధించి ఎస్ఐ మహేష్ ను వివరణ కోరగా… ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని చెప్పారు.