ETV Bharat / state

చలి కుంపటి మంటలు అంటుకుని.. వృద్ధురాలు సజీవదహనం

author img

By

Published : Jan 28, 2021, 8:36 AM IST

Updated : Jan 28, 2021, 6:41 PM IST

చలి కుంపటి మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం
చలి కుంపటి మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

08:34 January 28

.

old woman died in fire accident at vepada
వృద్ధురాలితోపాటు పూర్తిగా దగ్ధమైన ఇల్లు

విజయనగరం జిల్లా వేపాడ మండలం గొడుగులవీటిలో.. కిమిడి జోగులమ్మ (70) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఈ దారుణం చోటుచేసుకుంది. చలికాలంలో వెచ్చదనం కోసం మంచం కింద పెట్టిన కుంపటే ఘటనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా వీలు కాలేదు.  

స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కన జోగులమ్మ పాక వేసుకుని నివసిస్తోంది. మంచం కింద పెట్టిన కుంపటి నుంచి మంటలు చెలరేగాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమె కుమారుడు వేరే ఇంట్లో ఉంటుండగా.. అనారోగ్యంతో మంచం మీదున్న వృద్ధురాలు సజీవ దహనమవడం అందరినీ కలచివేసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

08:34 January 28

.

old woman died in fire accident at vepada
వృద్ధురాలితోపాటు పూర్తిగా దగ్ధమైన ఇల్లు

విజయనగరం జిల్లా వేపాడ మండలం గొడుగులవీటిలో.. కిమిడి జోగులమ్మ (70) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఈ దారుణం చోటుచేసుకుంది. చలికాలంలో వెచ్చదనం కోసం మంచం కింద పెట్టిన కుంపటే ఘటనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా వీలు కాలేదు.  

స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కన జోగులమ్మ పాక వేసుకుని నివసిస్తోంది. మంచం కింద పెట్టిన కుంపటి నుంచి మంటలు చెలరేగాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమె కుమారుడు వేరే ఇంట్లో ఉంటుండగా.. అనారోగ్యంతో మంచం మీదున్న వృద్ధురాలు సజీవ దహనమవడం అందరినీ కలచివేసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Last Updated : Jan 28, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.