ETV Bharat / state

మూడు రాజధానుల ఉద్యమంపై త్వరలోనే రూట్​మ్యాప్​: మంత్రి బొత్స

author img

By

Published : Oct 25, 2022, 9:10 PM IST

Minister Botsa Satyanarayana: అమరావతి రైతుల పాదయాత్ర ఆగినట్లేని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వాఖ్యలు చేశారు. ఏదీ ఏమైనా విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పడి.. ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుందని ఆయన అన్నారు.

Botsa Satyanarayana
బొత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana: భోగాపురం విమానాశ్రయం, గిరిజన వర్సిటీకి ప్రధాని చేతుల మీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స చెప్పారు. దానికి సంబంధించిన భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై విజయనగరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణలో కోర్టు వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. మూడు రాజధానుల ఉద్యమంపై రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నామన్న బొత్స.. అమరావతి రైతుల పాదయాత్ర ఆగినట్లేనని అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్లో రైతులు పండించిన చెరకును క్రషింగ్ కోసం శ్రీకాకుళం జిల్లాల్లోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపైనా అధికారులతో సమీక్షించారు.

Minister Botsa Satyanarayana: భోగాపురం విమానాశ్రయం, గిరిజన వర్సిటీకి ప్రధాని చేతుల మీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స చెప్పారు. దానికి సంబంధించిన భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై విజయనగరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణలో కోర్టు వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. మూడు రాజధానుల ఉద్యమంపై రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నామన్న బొత్స.. అమరావతి రైతుల పాదయాత్ర ఆగినట్లేనని అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్లో రైతులు పండించిన చెరకును క్రషింగ్ కోసం శ్రీకాకుళం జిల్లాల్లోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపైనా అధికారులతో సమీక్షించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.