ETV Bharat / state

శృంగవరపుకోటలో గంజాయి పట్టివేత.. విలువ రూ.21 లక్షలు

author img

By

Published : Jan 9, 2021, 7:41 AM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 21 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని వాహనంలో గుర్తించారు.

శృంగవరపుకొటలో గంజాయి పట్టివేత
శృంగవరపుకొటలో గంజాయి పట్టివేత

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.

డ్రైవర్​తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 21 లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.

డ్రైవర్​తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 21 లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్‌ఈసీ రమేష్ కుమార్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.