ETV Bharat / state

కరోనా ప్రభావం.. బొబ్బిలిలో 26 నుంచి సంపూర్ణ లాక్​డౌన్

విజయనగరం జిల్లాలో కొవిడ్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి అధికారులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా... బొబ్బిలిలో ఈ నెల 26 నుంచి మే 1 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ను అమలు చేయనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ ఎం.ఎం నాయుడు తెలిపారు.

author img

By

Published : Apr 24, 2021, 8:13 PM IST

bobbili lock down
bobbili lock down

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ నెల 26వ తేదీ నుంచి మే 1 వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 22వ తేదీ నుంచి మధ్యాహ్నం తర్వాత వర్తక సంఘాలు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కరోనా ఉద్ధృతి నియంత్రణలోకి రాని కారణంగా.. అధికారులు ఆంక్షలను మరింత తీవ్రతరం చేశారు.

అందులో భాగంగానే బొబ్బిలి పురపాలక సంఘం కమిషనర్ ఎం.ఎం.నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వ్యాపారులు సమావేశమయ్యారు. కరోనా రెండో దశ ఉద్ధృతిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వారం తర్వాత పరిస్థితిని సమీక్షించి.. తదుపరి నిర్ణయం తెలియచేస్తామన్నారు. పార్వతీపురంలో కొన్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛంద లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ నెల 26వ తేదీ నుంచి మే 1 వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 22వ తేదీ నుంచి మధ్యాహ్నం తర్వాత వర్తక సంఘాలు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కరోనా ఉద్ధృతి నియంత్రణలోకి రాని కారణంగా.. అధికారులు ఆంక్షలను మరింత తీవ్రతరం చేశారు.

అందులో భాగంగానే బొబ్బిలి పురపాలక సంఘం కమిషనర్ ఎం.ఎం.నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వ్యాపారులు సమావేశమయ్యారు. కరోనా రెండో దశ ఉద్ధృతిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వారం తర్వాత పరిస్థితిని సమీక్షించి.. తదుపరి నిర్ణయం తెలియచేస్తామన్నారు. పార్వతీపురంలో కొన్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛంద లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో.. అనధికార కర్ఫ్యూ, లాక్​డౌన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.