మహానుభావులు అభ్యసించిన చరిత్ర గల మహారాజ కళాశాలను... మాన్సాస్ చైర్మన్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారావు (బాలు) డిమాండ్ చేశారు. ఎంఆర్ కాలేజీ ఎదుట శాంతియుతంగా మోకాళ్లపై నిరసన తెలియజేశారు.
ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించడం చారిత్రక తప్పిదమని.. పేదలకు అండగా ఉండే విద్యాదేవాలయం ఆసరా లేకుండా పోతుందని బాలు అన్నారు. ఇలా జరిగితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు పరిశీలన నిమిత్తం ఆర్జేడీకి, ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్కు పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: