కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అధిక ధరలకు కొనుగోలు చేశామని భాజపా నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుటిల రాజకీయాలు చేయటం సరికాదని హితవు పలికారు. విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీచదవండి