ETV Bharat / state

Vizianagaram: ఎటు చూసినా కొత్త అందాలు.. మురిసిపోతున్న ప్రజలు

author img

By

Published : Apr 23, 2023, 4:46 PM IST

Beauty of Vizianagaram : నగరంలోని ప్రవేశ ద్వారాల వద్ద మన విజయనగరం, విద్యలనగరం, సాంస్కృతిక నగరం చిహ్నలు. వాటి చుట్టూ రంగురంగుల విద్యుత్తు కాంతులు, వాటర్ ఫౌంటెన్. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ ఘట్టమైన దండి మార్చ ఘట్టం. ఆ ఘట్టంలో పాల్గొన్న ప్రముఖుల విగ్రహాలు. అంతేకాదు., నగరంలోని ప్రధాన కూడళ్లలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ప్రముఖుల విగ్రహాలు. ఎన్టీఆర్, రాజీవ్ గాందీ దేశనాయకుల ప్రతిమలు. వాటి చుట్టు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతి, ఆ కాంతుల్లో నీటి జల్లులు. ఇక., జిల్లా చారిత్రాత్మక ప్రశస్త్యాన్ని తెలియచేసేలా విద్యుత్తు వెలుగులతో ఆధునీకరించిన గంటస్తంభం. ప్రధాన రహదారుల పొడవునా.., విద్యుత్తు స్తంబాలకు రంగురంగుల విద్యుత్తు దీపాల శోభ వాటికి అదనం. ఇదేదో సినిమా లేదా.., వేడుకల కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్ అనుకుంటున్నారా....? కాదండయ్​.., సుందరీకరణలో భాగంగా విజయనగరం ముఖ ద్వారాలు, ప్రధాన కూడళ్లు, రహదారులు సంతరించుకున్న నూతన సొబగులు.

Beauty of Vizianagaram
Beautification of Vizianagaram
నూతన అందాలతో శోభిల్లుతున్న విజయనగరం

Beauty of Vizianagaram: విజయనగరం కొత్త సొబగులను సొంతం చేసుకుంటోంది. ప్రముఖుల విగ్రహాలతో పాటు విద్యుత్తు కాంతుల మధ్య ముఖ్య కూడళ్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఎటు చూసినా కొత్త అందాలతో నగరం శోభాయమానంగా శోభిల్లుతోంది. పండగ వస్తే.. గాని అలంకరణ దీపాలు అమర్చలేని పరిస్థితి నుంచి అనునిత్యం రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ప్రజలను మురిపిస్తోంది విజయనగరం.

నగరం ప్రవేశ ముఖ ద్వారాల్లో నాలుగు వైపుల విద్యల నగరం, మన విజయనగరం, సాంస్కృతిక నగరం పేరుతో చిహ్నాలను ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతాలను విద్యుత్తు దీపాల అలంకరణ, వాటర్ ఫౌంటెన్​తో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక శిథిలావస్థకు చేరిన నగరానికి చారిత్రాత్మక చిహ్నమైన గంటస్తంభాన్ని అత్యంత అందంగా ఆధునీకరించారు. స్తంభం మొత్తం విద్యుత్తు కాంతులతో తీర్చిదిద్దటంతో పాటు.. స్తంభం ముందు భాగంలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.

ఇక నగరంలోని ప్రధాన కూడళ్లను ప్రముఖ దేశ నాయకులు, స్వాంతంత్య్ర సమరయోధుల విగ్రహాలను నెలకొల్పి.. వాటి పరిసరాలను ఆకర్షణీయంగా అలంకరించారు. నగరంలోని ప్రధాన ముఖద్వారమైన సంతకాల వంతెన కూడలిలో రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయటంతో పాటు.. అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల చేపల ఆక్వేరియమూ ఏర్పాటు చేశారు. అలాగే మన విజయనగరం పేరిట జలపాతాన్ని తలపించే విధంగా వాటర్ ఫౌంటెన్ నెలకొల్పారు.

ఇక పాలకొండ-విజయనగరం రోడ్డుకు స్వాగతం పలికే కూడలి వద్ద మినీ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపేట కూడలిలో రాధాకృష్ణుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి. ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రింగ్ రోడ్డు రైతు బజారు వద్ద ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ కూడలిని అందంగా మలిచారు. ఇదే ప్రాంతంలో ఉన్న జ్యోతిరావు ఫూలే, సావిత్రబాయి ఫూలే విగ్రహాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ఏర్పాట్లతో ప్రధాన కూడళ్లు రాత్రివేళ్లలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్​తో అత్యంత ఆకర్షణీయంగా మారాయి.

విజయనగరంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణలో స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నాలు, ప్రముఖుల విగ్రహాలకు చోటు కల్పించింది., నగరపాలక సంస్థ. ఇందులో భాగంగా సాంతంత్య్ర స్ఫూర్తిని రగిలించే ఉప్పు సత్యాగ్రహం దండి ఘట్టాన్ని ఐస్ ఫ్యాక్టరీ కూడలిలో నెలకొల్పారు. ఇందులో దండి మార్చ్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన 11మంది విగ్రహాల ఏర్పాటుతో పాటు.. ఆ ప్రాంతాన్ని విద్యుత్తు అలంకరణ, వాటర్ ఫౌంటెన్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి సుందరీకరణలో సముచిత స్థానం కల్పించారు.

నగరంలోని బాలాజీ కూడలిలోని అంబేడ్కర్ కూడలిగా మార్పు చేసి.. ఆ ప్రాంతంలోని పూరాతన విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోర్ట్ సిటీ పాఠశాల వద్ద ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పటి వరకు 3.5కోట్ల రూపాయలతో ఐదు కూడళ్లను అభివృద్ధి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని కూడళ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియచేశారు.

విజయనగరం నగరపాలక సంస్థ సుందరీకరణలో భాగంగా తీర్చిదిద్దిన కూడళ్లు, విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్​తో శోభయమానంగా మారటంతో.. నగర ప్రజలకు సందర్శన ప్రాంతాలుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో యువత, చిన్నారులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రతిరోజు సందడి చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల సుందరీకరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు.. ప్రధాన రహదారులను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ ఏర్పాట్లు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. అయితే, నగర సుందరీకరణలో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన వాటిపై పర్యవేక్షణతో పాటు.. నిర్వహణ ఉండాలని నగర ప్రజలు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

నూతన అందాలతో శోభిల్లుతున్న విజయనగరం

Beauty of Vizianagaram: విజయనగరం కొత్త సొబగులను సొంతం చేసుకుంటోంది. ప్రముఖుల విగ్రహాలతో పాటు విద్యుత్తు కాంతుల మధ్య ముఖ్య కూడళ్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఎటు చూసినా కొత్త అందాలతో నగరం శోభాయమానంగా శోభిల్లుతోంది. పండగ వస్తే.. గాని అలంకరణ దీపాలు అమర్చలేని పరిస్థితి నుంచి అనునిత్యం రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ప్రజలను మురిపిస్తోంది విజయనగరం.

నగరం ప్రవేశ ముఖ ద్వారాల్లో నాలుగు వైపుల విద్యల నగరం, మన విజయనగరం, సాంస్కృతిక నగరం పేరుతో చిహ్నాలను ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతాలను విద్యుత్తు దీపాల అలంకరణ, వాటర్ ఫౌంటెన్​తో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక శిథిలావస్థకు చేరిన నగరానికి చారిత్రాత్మక చిహ్నమైన గంటస్తంభాన్ని అత్యంత అందంగా ఆధునీకరించారు. స్తంభం మొత్తం విద్యుత్తు కాంతులతో తీర్చిదిద్దటంతో పాటు.. స్తంభం ముందు భాగంలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.

ఇక నగరంలోని ప్రధాన కూడళ్లను ప్రముఖ దేశ నాయకులు, స్వాంతంత్య్ర సమరయోధుల విగ్రహాలను నెలకొల్పి.. వాటి పరిసరాలను ఆకర్షణీయంగా అలంకరించారు. నగరంలోని ప్రధాన ముఖద్వారమైన సంతకాల వంతెన కూడలిలో రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయటంతో పాటు.. అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల చేపల ఆక్వేరియమూ ఏర్పాటు చేశారు. అలాగే మన విజయనగరం పేరిట జలపాతాన్ని తలపించే విధంగా వాటర్ ఫౌంటెన్ నెలకొల్పారు.

ఇక పాలకొండ-విజయనగరం రోడ్డుకు స్వాగతం పలికే కూడలి వద్ద మినీ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపేట కూడలిలో రాధాకృష్ణుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి. ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రింగ్ రోడ్డు రైతు బజారు వద్ద ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ కూడలిని అందంగా మలిచారు. ఇదే ప్రాంతంలో ఉన్న జ్యోతిరావు ఫూలే, సావిత్రబాయి ఫూలే విగ్రహాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ఏర్పాట్లతో ప్రధాన కూడళ్లు రాత్రివేళ్లలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్​తో అత్యంత ఆకర్షణీయంగా మారాయి.

విజయనగరంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణలో స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నాలు, ప్రముఖుల విగ్రహాలకు చోటు కల్పించింది., నగరపాలక సంస్థ. ఇందులో భాగంగా సాంతంత్య్ర స్ఫూర్తిని రగిలించే ఉప్పు సత్యాగ్రహం దండి ఘట్టాన్ని ఐస్ ఫ్యాక్టరీ కూడలిలో నెలకొల్పారు. ఇందులో దండి మార్చ్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన 11మంది విగ్రహాల ఏర్పాటుతో పాటు.. ఆ ప్రాంతాన్ని విద్యుత్తు అలంకరణ, వాటర్ ఫౌంటెన్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి సుందరీకరణలో సముచిత స్థానం కల్పించారు.

నగరంలోని బాలాజీ కూడలిలోని అంబేడ్కర్ కూడలిగా మార్పు చేసి.. ఆ ప్రాంతంలోని పూరాతన విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోర్ట్ సిటీ పాఠశాల వద్ద ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పటి వరకు 3.5కోట్ల రూపాయలతో ఐదు కూడళ్లను అభివృద్ధి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని కూడళ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియచేశారు.

విజయనగరం నగరపాలక సంస్థ సుందరీకరణలో భాగంగా తీర్చిదిద్దిన కూడళ్లు, విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్​తో శోభయమానంగా మారటంతో.. నగర ప్రజలకు సందర్శన ప్రాంతాలుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో యువత, చిన్నారులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రతిరోజు సందడి చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల సుందరీకరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు.. ప్రధాన రహదారులను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ ఏర్పాట్లు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. అయితే, నగర సుందరీకరణలో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన వాటిపై పర్యవేక్షణతో పాటు.. నిర్వహణ ఉండాలని నగర ప్రజలు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.