ETV Bharat / state

నీతివంతమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ విజయసాయి రెడ్డి - పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన ఎంపీ విజయసాయి

నీతివంతమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

vijyasai reddy distributed houses to poor
vijyasai reddy distributed houses to poor
author img

By

Published : Jan 8, 2021, 8:30 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పేదల కోసం నిర్మించిన గృహాల పట్టాలను ఎంపీ విజయసాయి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇచ్చామని విజయసాయి రెడ్డి తెలిపారు. నీతివంతమైన పాలన అందించడమే వైకాపా ప్రభుత్య ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చాలని సీఎం జగన్​ ఆలోచనలో ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

vijyasai reddy distributed houses to poor
ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి

ఇళ్ల పట్టాలు రానివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి సూచించారు. ఇందుకోసం 90 రోజుల సమయం ఇచ్చారని తెలిపారు. భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ, ఎంపీ సత్యవతి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

vijyasai reddy distributed houses to poor
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

ఇదీ చదవండి: పర్యటనపై పోలీసుల ఆంక్షలు... 'వస్తున్నాను' అంటూ పవన్ ట్వీట్

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పేదల కోసం నిర్మించిన గృహాల పట్టాలను ఎంపీ విజయసాయి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇచ్చామని విజయసాయి రెడ్డి తెలిపారు. నీతివంతమైన పాలన అందించడమే వైకాపా ప్రభుత్య ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చాలని సీఎం జగన్​ ఆలోచనలో ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

vijyasai reddy distributed houses to poor
ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి

ఇళ్ల పట్టాలు రానివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి సూచించారు. ఇందుకోసం 90 రోజుల సమయం ఇచ్చారని తెలిపారు. భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ, ఎంపీ సత్యవతి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

vijyasai reddy distributed houses to poor
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

ఇదీ చదవండి: పర్యటనపై పోలీసుల ఆంక్షలు... 'వస్తున్నాను' అంటూ పవన్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.