ETV Bharat / state

పర్యాటకశాఖలోని ఉద్యోగాలన్నీ... స్థానిక గిరిజనులకే - Tourism Minister Muttamshetti Srinivas inaugurates Drive-in Restaurant under Tourism Department

అరకులోయలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్​ని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు.

Tourism Minister Muttamshetti Srinivas in vishakapatnam latest
author img

By

Published : Oct 4, 2019, 8:07 PM IST

పర్యాటక శాఖలోని ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే

అరకు లోయను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.156 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్​ను ఆయన ప్రారంభించారు. అరకు లోయ నుంచి లంబసింగి వరకు పలు పనులను చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయం ,వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి ,చిట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.గరుడవాహన సేవకు.. తితిదే అనూహ్య ఏర్పాట్లు

పర్యాటక శాఖలోని ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే

అరకు లోయను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.156 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్​ను ఆయన ప్రారంభించారు. అరకు లోయ నుంచి లంబసింగి వరకు పలు పనులను చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయం ,వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి ,చిట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.గరుడవాహన సేవకు.. తితిదే అనూహ్య ఏర్పాట్లు

Intro:అరకు లోయ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 156 కోట్లతో డి పి ఆర్ ప్రతిపాదనలు చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు అరకులోయలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూపాయిలు 2 కోట్లతో డ్రైవింగ్ రెస్టారెంట్ ఆయన ప్రారంభించారు అరకు లోయ పర్యాటకులు మరింత సందర్శించాలని వీలుగా అరకు లోయ నుంచి లంబసింగి వరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు పనులను చేపడుతున్నామన్నారు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు


Body:అరకులోయలో 18 కోట్లతో వివిధ పనులను పర్యాటక అభివృద్ధికి కేటాయించామన్నారు గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ గిరిజన విశ్వవిద్యాలయం వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు గిరిజనులకు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు పర్యాటక అభివృద్ధి లో భాగంగా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజ్ కి ఇచ్చి పి పి ఏ ప్రాతిపదికన పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు


Conclusion:పర్యాటక శాఖ లోని ఉద్యోగాలు అన్ని స్థానిక క గిరిజనులకే ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో లో అరకు కు ఎంపీ మాధవి ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి చిట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.