ETV Bharat / state

వ్యవసాయ బావిలో మునిగి బాలుడు మృతి

author img

By

Published : Dec 8, 2020, 9:20 PM IST

సరదాగా ఈత నేర్చుకుందామని మిగతా పిల్లలతో కలిసి ఆ బాలుడు వ్యవసాయ బావిలోకి దిగాడు. అయితే ఈత రాక అందులో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా రాయుడుపాలెంలో జరిగింది.

boy tejus
వ్యవసాయ బావిలో మునిగి బాలుడు మృతి

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాయుడుపాలెంలో వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందాడు. కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు పిల్లలు బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు.

తేజస్ అనే బాలుడు ఈత రాక బావిలో మునిగి చనిపోయాడు. ఆ చిన్నారి మూడో తరగతి చదువుతున్నాడు. తేజస్ మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాయుడుపాలెంలో వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందాడు. కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు పిల్లలు బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు.

తేజస్ అనే బాలుడు ఈత రాక బావిలో మునిగి చనిపోయాడు. ఆ చిన్నారి మూడో తరగతి చదువుతున్నాడు. తేజస్ మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.