దొంగ డిగ్రీలు చదివిన జగన్ రెడ్డి.. దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడుతున్నారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఏ తప్పూ చేయని అశోక్ బాబు గురించి మాట్లాడే ముందు.. జగన్ తన వెనుక చూసుకోవాలని హితవు పలికారు. కావాల్సిన చోట ఎంబీఏ అని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అఫిడవిట్ లో బీ.కామ్ అని పెట్టిన మీ చరిత్ర మర్చిపోయారా? అని నిలదీశారు. జగన్ విద్యార్హతకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
-
దొంగ బ్రతుకులు బ్రతుకుతూ, దొంగ డిగ్రీలు చదివిన మీరా,దొంగ సర్టిఫికేట్ల గురించి మాట్లాడేది?
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి గురించి అనే ముందు, మీ వెనుక చూసుకోండి. (1/2) pic.twitter.com/qIqNEF0nJw
">దొంగ బ్రతుకులు బ్రతుకుతూ, దొంగ డిగ్రీలు చదివిన మీరా,దొంగ సర్టిఫికేట్ల గురించి మాట్లాడేది?
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 11, 2022
ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి గురించి అనే ముందు, మీ వెనుక చూసుకోండి. (1/2) pic.twitter.com/qIqNEF0nJwదొంగ బ్రతుకులు బ్రతుకుతూ, దొంగ డిగ్రీలు చదివిన మీరా,దొంగ సర్టిఫికేట్ల గురించి మాట్లాడేది?
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 11, 2022
ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి గురించి అనే ముందు, మీ వెనుక చూసుకోండి. (1/2) pic.twitter.com/qIqNEF0nJw
కక్షసాధింపులకే పరిమితం -సోమిరెడ్డి
అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఈ రోజుకీ ప్రజాపాలనపై దృష్టిపెట్టకుండా కక్షసాధింపులకే జగన్ రెడ్డి పరిమితమయ్యారని మరో నేత సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్జ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ కుట్రలపై ధ్వజమెత్తినందుకే అశోక్ బాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎల్లకాలం కొనసాగించలేరన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.