ETV Bharat / state

విశాఖలో వైద్యుడిపై దాడి.. ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన

author img

By

Published : May 25, 2021, 8:33 PM IST

విశాఖ కేజీహెచ్​లో ఓ వైద్యుడిపై కొందరు దాడి చేశారు. దీనికి నిరసనగా ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన
ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన

విశాఖ కేజీహెచ్​లో డాక్టర్ సి. దత్తాప్రసాద్ రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డును నెట్టివేసి, దుర్బాషలాడుతూ మార్చురీలోకి ప్రవేశించి మరీ శవ పరీక్ష నిర్వహిస్తున్న దత్తా ప్రసాద్ రెడ్డిపై దాడి చేసినట్లు తోటి వైద్యులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్నుచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

డాక్టర్​పై దాడిని ఖండిస్తూ వైద్య విద్యార్థులంతా ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

విశాఖ కేజీహెచ్​లో డాక్టర్ సి. దత్తాప్రసాద్ రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డును నెట్టివేసి, దుర్బాషలాడుతూ మార్చురీలోకి ప్రవేశించి మరీ శవ పరీక్ష నిర్వహిస్తున్న దత్తా ప్రసాద్ రెడ్డిపై దాడి చేసినట్లు తోటి వైద్యులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్నుచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

డాక్టర్​పై దాడిని ఖండిస్తూ వైద్య విద్యార్థులంతా ఆంధ్ర వైద్య కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.