ETV Bharat / state

సవాల్ విసిరాడని... స్నేహితుడ్ని హతమార్చారు

రెండు వర్గాల మధ్య ఉన్న చిన్నపాటి ఘర్షణలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ గొడవలో సవాల్ విసిరాడని రాంబాబు అనే వ్యక్తిని ప్రత్యర్థి వర్గం వారు దారుణంగా హత్య చేశారు.

author img

By

Published : Sep 7, 2019, 4:54 PM IST

హత్య
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ

విశాఖ వాంబే కాలనీలో జరిగిన విల్లపు రాంబాబు హత్య కేసును విశాఖ పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. హత్యకు కీలక సూత్రధారి అయిన వెంకటేష్​ సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ వాంబే కాలనీలో ఈ నెల 3వ తేదీన విల్లపు రాంబాబు అనే వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. మిత్రుల మధ్య జరిగిన వివాదమే హత్యకు దారి తీసింది. చిన్నపాటి మనస్పర్థలకే నగరానికి చెందిన కృష్ణమోహన్, వెంకటేశ్ ఓ వర్గంగా... రాంబాబు, అంజి, శివ కలిసి మరో వర్గంగా ఏర్పడ్డారు. వీరిలో కృష్ణ మోహన్ నగరాన్ని వీడి వెళ్లిపోగా అతన్ని పిలిపించమని వెంకటేశ్​తో ప్రత్యర్థి వర్గం గొడవ పెట్టుకునేవారు. ఈ నెల 3న కూడా ఇలానే చిన్న గొడవ పడ్డారు. అయితే దీనిలో రాంబాబు అనే వ్యక్తి కొంత ఆవేశంతో "మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను" అంటూ మరో వర్గానికి సవాల్ విసిరాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్.. మరికొందరితో కలిసి రాంబాబును అదేరోజు రాత్రి హత్య చేసినట్లు డీసీపీ రంగారెడ్డి తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కక్షలతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ అన్నారు. నిందితులపై గతంలో నేరచరిత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపి రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు.

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ

విశాఖ వాంబే కాలనీలో జరిగిన విల్లపు రాంబాబు హత్య కేసును విశాఖ పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. హత్యకు కీలక సూత్రధారి అయిన వెంకటేష్​ సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ వాంబే కాలనీలో ఈ నెల 3వ తేదీన విల్లపు రాంబాబు అనే వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. మిత్రుల మధ్య జరిగిన వివాదమే హత్యకు దారి తీసింది. చిన్నపాటి మనస్పర్థలకే నగరానికి చెందిన కృష్ణమోహన్, వెంకటేశ్ ఓ వర్గంగా... రాంబాబు, అంజి, శివ కలిసి మరో వర్గంగా ఏర్పడ్డారు. వీరిలో కృష్ణ మోహన్ నగరాన్ని వీడి వెళ్లిపోగా అతన్ని పిలిపించమని వెంకటేశ్​తో ప్రత్యర్థి వర్గం గొడవ పెట్టుకునేవారు. ఈ నెల 3న కూడా ఇలానే చిన్న గొడవ పడ్డారు. అయితే దీనిలో రాంబాబు అనే వ్యక్తి కొంత ఆవేశంతో "మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను" అంటూ మరో వర్గానికి సవాల్ విసిరాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్.. మరికొందరితో కలిసి రాంబాబును అదేరోజు రాత్రి హత్య చేసినట్లు డీసీపీ రంగారెడ్డి తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కక్షలతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ అన్నారు. నిందితులపై గతంలో నేరచరిత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపి రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు.

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG12_07_LOCKED_HOUSE_CHOREE_AV_AP10092
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం వేండ్ర వారి పాలెం లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారు వెండి వస్తువులు దోచుకుపోయారు.


Body:గ్రామానికి చెందిన వీరవల్లి పాల శంకరం కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా దొంగలు దొంగలు పడినట్లు గుర్తించారు. బీరువా తాళాలు తీసి 40 గ్రాముల బంగారు వస్తువులు, 100 గ్రాముల వెండి వస్తువులు దోచుకుపోయారు.


Conclusion:ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.