ETV Bharat / state

వాల్తేరు రైల్వే డివిజన్ కోసం..ఉద్యోగుల ఉద్యమం

వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ కేటాయించిన కేంద్రం.. ఉనికిలో ఉన్న డివిజన్‌ను తొలగించడం సరికాదని రైల్వే ఉద్యోగులు, ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. వాల్తేరు డివిజన్‌ తొలగిస్తే ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు.

author img

By

Published : Jul 25, 2019, 7:02 AM IST

railway zone
ఉద్యోగుల ఉద్యమం - వాల్తేరు రైల్వే డివిజన్ కోసం

ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉండే విశాఖనగరం.. రైల్వేపరంగా అతి ముఖ్యమైన కేంద్రం. వాల్తేరు డివిజన్‌గా రైల్వేలో అత్యంత ప్రముఖ స్ధానాన్ని పదిలం చేసుకున్న ఈ రైల్వే డివిజన్‌ కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మైలురాయిని దాటిన డివిజన్లలో వాల్తేరుదే అగ్రస్ధానం. కోల్‌కతా-చెన్నై మార్గాన్ని అనుసంధానిస్తూ భారతీయ రైల్వే చరిత్రలో సుస్ధిర స్ధానం సంపాదించింది. అయితే ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేస్తూ.. కేంద్రం సాధారణ ఎన్నికలకు ముందే నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత... తూర్పు కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం.. ప్రధాన కార్యాలయం విశాఖలో ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది.

సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కానీ.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు... జోన్ ఏర్పాటు ప్రక్రియల్లో భౌగోళిక సరిహద్దులు, ఇతర విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడ్డారు.

తమ డిమాండ్లు పట్టించుకోకుండా.... కొత్తగా నియమితులైన వోఎస్​డీ సరిహద్దుల విభజనకు ప్రయత్నించడంతో.. ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయంపై పునరాలోచించాలని కోరుతూ దిల్లీలో రైల్వే ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందుగా ఉద్యోగుల తరపున కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని రైల్వే ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

గవర్నర్​గా బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం

ఉద్యోగుల ఉద్యమం - వాల్తేరు రైల్వే డివిజన్ కోసం

ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉండే విశాఖనగరం.. రైల్వేపరంగా అతి ముఖ్యమైన కేంద్రం. వాల్తేరు డివిజన్‌గా రైల్వేలో అత్యంత ప్రముఖ స్ధానాన్ని పదిలం చేసుకున్న ఈ రైల్వే డివిజన్‌ కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మైలురాయిని దాటిన డివిజన్లలో వాల్తేరుదే అగ్రస్ధానం. కోల్‌కతా-చెన్నై మార్గాన్ని అనుసంధానిస్తూ భారతీయ రైల్వే చరిత్రలో సుస్ధిర స్ధానం సంపాదించింది. అయితే ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేస్తూ.. కేంద్రం సాధారణ ఎన్నికలకు ముందే నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత... తూర్పు కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం.. ప్రధాన కార్యాలయం విశాఖలో ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది.

సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కానీ.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు... జోన్ ఏర్పాటు ప్రక్రియల్లో భౌగోళిక సరిహద్దులు, ఇతర విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడ్డారు.

తమ డిమాండ్లు పట్టించుకోకుండా.... కొత్తగా నియమితులైన వోఎస్​డీ సరిహద్దుల విభజనకు ప్రయత్నించడంతో.. ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయంపై పునరాలోచించాలని కోరుతూ దిల్లీలో రైల్వే ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందుగా ఉద్యోగుల తరపున కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని రైల్వే ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

గవర్నర్​గా బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి లో యువకుడిని గుర్తుతెలియని హత్య చేశారుBody:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు ...వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ babavali(30) గత కొంతకాలంగా మురికిపూడి గ్రామంలో చికెన్ కొట్టు తో పాటు, చికెన్ పకోడీ బండి నడుపు కొంటున్నాడు ..ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే మంగళవారం రాత్రి అతను ఉంటున్న గదిలో పడుకున్నాడు.. తెల్లవారి చూసేసరికి మెడపై కత్తితో నరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు... సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు ,ఎస్.అనిల్ కుమార్ లు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు ..అక్రమ సంబంధమే హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.