ETV Bharat / state

వినతి పత్రం ఇద్దామంటే పత్తా లేని అధికారులు, సిబ్బంది - పద్మనాభం మండలంలోని తెదేపా నేతలు ఆందోళనలు

పద్మనాభం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయటంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. జరిగిన విషయంపై స్పందించాలని తహసీల్దార్​కి వినతి పత్రం ఇద్దామని వెళ్ళారు. కానీ అక్కడ అధికారులు, కార్యాలయ సిబ్బంది లేకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.

protests-over-demolition-of-telugu-desam-party-office-at-padmanabham-mandal-in-visakha
'వినతి పత్రం ఇద్దామంటే అధికారులు లేరు'
author img

By

Published : Feb 10, 2020, 2:14 PM IST

'వినతి పత్రం ఇద్దామంటే అధికారులు లేరు'

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై ఆపార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కూల్చి వేసిన ప్రదేశం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అక్కడ తహసీల్దార్​తో సహా సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోవడంతో తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము ర్యాలీ చేసి.. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే.. ఈ రకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తహసీల్దార్ గది ముందే బైఠాయించి నిరసన చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని నినదించారు.

ఇదీ చదవండి: ఎన్​ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా రాజంపేటలో వామపక్షాల ప్రజాగర్జన

'వినతి పత్రం ఇద్దామంటే అధికారులు లేరు'

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై ఆపార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కూల్చి వేసిన ప్రదేశం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అక్కడ తహసీల్దార్​తో సహా సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోవడంతో తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము ర్యాలీ చేసి.. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే.. ఈ రకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తహసీల్దార్ గది ముందే బైఠాయించి నిరసన చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని నినదించారు.

ఇదీ చదవండి: ఎన్​ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా రాజంపేటలో వామపక్షాల ప్రజాగర్జన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.