రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల ముందు జనం క్యూ కట్టారు. చాలాచోట్ల భౌతిక దూరం మరిచి గుంపులుగా చేరారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
45 రోజులుగా పాటించిన లాక్ డౌన్, అత్యవసర విభాగాలు చేసిన సేవ, జీతాల్లో కోత విధించుకుని కరోనాపై పోరాటానికి చేసిన త్యాగం, నిరుపేదలను ఆదుకున్న దాతల దాతృత్వం ఈ ఒక్క ఘటనతో వృథా అయిపోయాయని తన బాధను వీడియోలో వ్యక్తం చేసింది.
ఇలా జనం గుంపులుగా తిరిగితే వైరస్ వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖ జిల్లాకు చెందిన మహిళ.. ఈ వీడియోనూ రూపొందించినట్టుగా తెలుస్తోంది.
ఇవీ చదవంండి: