పరిపాలనపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే శక్తిలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పనిచేస్తుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ టీజీ వెంకటేశ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని వనరులు ఏపీలో ఉన్నాయని టీజీ వ్యాఖ్యానించారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరే ఇతర నగరం ఎక్కువగా అభివృద్ధి చెందలేదన్న ఆయన... ఏపీలో ఎక్కువ సంఖ్యలో నగరాలు అభివృద్ధి చెందాయన్నారు. విశాఖను రాజధాని చేయాలని 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: '3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించటం సరికాదు'