ETV Bharat / state

బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన - యుద్ధ విమానంలో రామ్మోహన్‌నాయుడు ప్రయాణం - RAM MOHAN NAIDU AT AERO INDIA 2025

బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి - యుద్ధవిమానంలో ప్రయాణించిన రామ్మోహన్‌నాయుడు

Kinjarapu Ram Mohan Naidu
Kinjarapu Ram Mohan Naidu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 7:57 PM IST

Ram Mohan Naidu at Aero India 2025: బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ విమానంలో ప్రయాణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు తయారు చేయడంపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. హెచ్ఏఎల్ (Hindustan Aeronautics Limited) స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందంటూ రామ్మోహన్​ నాయుడు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. కాగా బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో (Aero India 2025) 10వ తేదీన మొదలైంది. ఇది 14వ తేదీ వరకూ జరగనుంది.

రాజ్యసభలో రామ్మోహన్‌నాయుడిపై సుధామూర్తి మాతృప్రేమ - ఏం జరిగిందంటే

Ram Mohan Naidu at Aero India 2025: బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ విమానంలో ప్రయాణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు తయారు చేయడంపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. హెచ్ఏఎల్ (Hindustan Aeronautics Limited) స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందంటూ రామ్మోహన్​ నాయుడు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. కాగా బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో (Aero India 2025) 10వ తేదీన మొదలైంది. ఇది 14వ తేదీ వరకూ జరగనుంది.

రాజ్యసభలో రామ్మోహన్‌నాయుడిపై సుధామూర్తి మాతృప్రేమ - ఏం జరిగిందంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.