ETV Bharat / state

ఏపీలో మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం: సీఎం చంద్రబాబు - WORK FROM HOME FOR WOMEN

మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ప్రారంభించేందుకు వ్యూహరచన - స్టెమ్ కోర్సుల్లో అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు వెల్లడి

WORK FROM HOME FOR WOMEN
WORK FROM HOME FOR WOMEN (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 10:23 PM IST

Work From Home Policy for Women in AP: రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు.

రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్​లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్ధవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు.

ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

గిరిజనుల హక్కులు కాపాడతాం - 1/70 చట్టం తొలగించం: చంద్రబాబు

'మరోసారి ఇలా చేస్తే సహించేది లేదు' - మంత్రులు, కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Work From Home Policy for Women in AP: రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు.

రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్​లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్ధవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు.

ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

గిరిజనుల హక్కులు కాపాడతాం - 1/70 చట్టం తొలగించం: చంద్రబాబు

'మరోసారి ఇలా చేస్తే సహించేది లేదు' - మంత్రులు, కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.