విశాఖలో రాజకీయ ఐకాస ప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా అనుకున్న ప్రకారమే జరిపించాలని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎన్నికలు రద్దు చేయటం సమంజసం కాదని ఐకాస ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవటంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని వాపోయారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఎన్నికలు యధావిధిగా జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈసీ తీరును నిరసిస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐకాస ఆందోళన
స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐకాస ప్రతినిధులు విశాఖలో ఆందోళన చేపట్టారు. ఈసీ తీరును నిరసిస్తూ ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
విశాఖలో రాజకీయ ఐకాస ప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా అనుకున్న ప్రకారమే జరిపించాలని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎన్నికలు రద్దు చేయటం సమంజసం కాదని ఐకాస ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవటంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని వాపోయారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఎన్నికలు యధావిధిగా జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఉద్యోగుల శ్రమదానం.. బీచ్లో చెత్త మాయం