ETV Bharat / state

డిసెంబరులో విశాఖపట్నంలో జాతీయ లోక్‌అదాలత్‌

విశాఖపట్నంలో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

author img

By

Published : Nov 12, 2020, 3:02 PM IST

national lok adalath
జిల్లా కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబరు 12వ తేదీన లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ ఎ.హరిహరనాథ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో లోక్​అదాలత్​ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న, రాజీకి అర్హత కలిగిన, సివిల్‌, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సంప్రదించాలని చెప్పారు. వివరాలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌లో సంప్రదించాలన్నారు.

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబరు 12వ తేదీన లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ ఎ.హరిహరనాథ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో లోక్​అదాలత్​ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న, రాజీకి అర్హత కలిగిన, సివిల్‌, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సంప్రదించాలని చెప్పారు. వివరాలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌లో సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి: జంతు ప్రదర్శనశాలల్లో కల్పించాల్సిన వసతుల పై సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.