ETV Bharat / state

పీఎం సహాయనిధిని వినియోగించుకోండి: ఎంపీ సత్యవతి

author img

By

Published : Jan 13, 2020, 12:44 PM IST

Updated : Jan 13, 2020, 5:17 PM IST

అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీ సత్యవతి సూచించారు. ఆదివారం నలుగురికి ఆమె 10 లక్షల రూపాయల పీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.

mp satyavathi distributed pm relief funds
mp satyavathi distributed pm relief funds
పీఎం సహాయనిధిని వినియోగించుకోవాలని ఎంపీ సత్యవతి సూచన

ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారితో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నలుగురు రోగులకు చికిత్స నిమిత్తం 10,84,200 రూపాయలు నగదు చెక్కును పంపిణీ చేశారు. అనంతరం యువజనోత్సవాల్లో భాగంగా ఎంపీ కార్యాలయంలో స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆమె... యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యంతో హెచ్​పీసీఎల్ కంపెనీ అనకాపల్లిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వివరించారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

పీఎం సహాయనిధిని వినియోగించుకోవాలని ఎంపీ సత్యవతి సూచన

ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారితో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నలుగురు రోగులకు చికిత్స నిమిత్తం 10,84,200 రూపాయలు నగదు చెక్కును పంపిణీ చేశారు. అనంతరం యువజనోత్సవాల్లో భాగంగా ఎంపీ కార్యాలయంలో స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆమె... యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యంతో హెచ్​పీసీఎల్ కంపెనీ అనకాపల్లిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వివరించారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

'మంత్రులను మేము కలవలేదు.. అబద్ధం చెప్పకండి'

Intro:Ap_vsp_46_12_vo_pradhana_mantri_sahaya_nidhi_mp_pampini_ab_AP10077_k.Bhanojirao_8008574722
దేశంలోని వివిధ పరిస్థితులతో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నలుగురు రోగులకు చికిత్స నిమిత్తం 10 లక్షల 84వేల 200 రూపాయలు నగదు చెక్కును పంపిణీ చేశారు అనంతరం యువజనోత్సవాల్లో భాగంగా ఎంపీ కార్యాలయంలో స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు


Body:ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ మాట్లాడుతూ యువతకి ఉపాధి కల్పించే లక్ష్యంతో హెచ్ పీ సీ ఎల్ కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రూ 3 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వివరించారు దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన యువజనోత్సవాల్లో వైకాపా నాయకులు డాక్టర్ విష్ణుమూర్తి, పెదబాబు, శ్రీనాథ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు


Conclusion:బైట్1 డాక్టర్ వెంకట సత్యవతి అనకాపల్లి ఎంపీ
Last Updated : Jan 13, 2020, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.