గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల్లో... లులూ వ్యవహారం ఒకటని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ బీచ్ రోడ్డులో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం అనువుకాదనే... ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీనిపై ప్రజల్లోనూ హర్షం వ్యక్తం అవుతోందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయంటూ... చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. వ్యాపారవేత్తలు లాభం వస్తుందంటేనే ఎక్కడైనా పెట్టుబడి పెడతారన్నారు. విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో... సీజనల్ జ్వరాలపై మంత్రి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టే అంశంపై అధికారులకు సూచనలు చేశారు. గతేడాదితో పోల్చితే డెంగీ, మలేరియా కేసులు తగ్గాయన్నారు.
ఇదీ చదవండి
చెగువేరాలోని తెగువ... ఐన్స్టీన్లోని తెలివి.. కలిపితే జార్జ్..!