రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ పోతనమల్లయ్యపాలెం సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభ క్రికెట్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... మధురవాడ అభివృద్ధి చెందుతుందని..అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కనే అకాడమీ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. తొందర్లోనే కొమ్మాది ఇండోర్ స్టేడియం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి