ETV Bharat / state

పాయకరావుపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జనసేన పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు.

author img

By

Published : Apr 30, 2020, 2:00 PM IST

పాయకరావుపేటలో పేదలకు కూరగాయల పంపిణీ చేసిన జనసైనికులు
పాయకరావుపేటలో పేదలకు కూరగాయల పంపిణీ చేసిన జనసైనికులు

లాక్​డౌన్​ నేపథ్యంలో విశాఖలో జనసేన పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన జనసేన పార్టీ నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో గుంటపల్లి, పెద్దిపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు రెండు వేల కుటుంబాలకు రూ.5 లక్షల విలువ చేసే సరుకులు అందించారు. తమ పార్టీ అధినేత పవన్​కల్యాణ్​ ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు జనసైనికులు వివరించారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ నేపథ్యంలో విశాఖలో జనసేన పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన జనసేన పార్టీ నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో గుంటపల్లి, పెద్దిపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు రెండు వేల కుటుంబాలకు రూ.5 లక్షల విలువ చేసే సరుకులు అందించారు. తమ పార్టీ అధినేత పవన్​కల్యాణ్​ ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు జనసైనికులు వివరించారు.

ఇదీ చదవండి:

పేదలకు నిత్యావసరాలు అందించిన జన సైనికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.