ETV Bharat / state

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

author img

By

Published : Apr 2, 2021, 5:34 PM IST

విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

intuc
ఐఎన్​టీయూసీ విశాఖ పరిశ్రమ తాజా వార్తలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఐఎన్​టీయూసీ డిమాండ్ చేసింది. వైజాగ్ జర్నలిస్ట్​ ఫోరం ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించింది. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల దారి పట్టేందుకు సొంత గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 12న జరగనున్న హైపవర్ కమిటీ సమావేశంలో కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయించిందని తెలుగు శక్తి వ్యవస్థాపకులు బీవీ శ్రీరామ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించడం లేదని అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఐఎన్​టీయూసీ డిమాండ్ చేసింది. వైజాగ్ జర్నలిస్ట్​ ఫోరం ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించింది. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల దారి పట్టేందుకు సొంత గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 12న జరగనున్న హైపవర్ కమిటీ సమావేశంలో కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయించిందని తెలుగు శక్తి వ్యవస్థాపకులు బీవీ శ్రీరామ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించడం లేదని అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.