ETV Bharat / state

గిరి'జనాని'కి పోలీసుల బతుకు'బాట'!

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు పరిధిలో.. విశాఖ మన్యంలోని గిరిజనులకు పోలీసులు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కష్టాలు తీర్చి.. బతుకుబాట చూపారు.

author img

By

Published : Mar 6, 2019, 10:05 PM IST

గిరిజనులకు ఉచిత బస్సు సర్వీసు
గిరిజనులకు ఉచిత బస్సు సర్వీసు
ఆ ప్రాంత గిరిజనులకు గమ్యాన్ని చేరాలంటే నిత్యం నడకే ఆధారం. కావాల్సిన చోటికి ఎప్పుడు చేరతారో తెలియని దుస్థితి. అలాంటి చోటుకు బస్సు వచ్చిందంటే పండగే. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే అధిక రుసుములతో వారి జేబులకు చిల్లులు ఖాయం. ఆ డ్రైవర్ల అతివేగానికి అప్పుడప్పుడూ ప్రమాదాల బారిన పడడం అదనం. నిత్యం మండల కేంద్రాలు, కళాశాలకు, సంతలకు వెళ్లి.. తిరిగి సొంత గూటికి చేరడం వారికి ఓ యుద్ధంతో సమానం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ సమస్యకు.. పోలీసులు పరిష్కారం చూపారు. ఉచిత బస్సు ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీర్చారు.

విశాఖ మన్యం సువిశాల కొండకోనల ప్రాంతం. గిరిజనాభివృద్ధి సంస్థ చాలా ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించినా... ఇప్పటికీ రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అధిక రుసుము వసూలు చేస్తూ జీపు సర్వీసులు నడుపుతున్నారు. ఎక్కువ సంఖ్యలో జనాలను ఎక్కించడం వల్ల ప్రమాదాల బారిన పడి.. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందులోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వ సర్వీసులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు రావో తెలియని దుస్థితి. ఈ కారణంతోనే.. ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత రవాణా సర్వీసులు మొదలు పెట్టింది పోలీసు శాఖ.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టు నుంచి కుమడ వరకు ఒక సర్వీసు, జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు మరో ఉచిత సర్వీసును నడిపిస్తున్నారు. కుమడ బస్సు ప్రారంభించి 2 వారాలు అవుతోంది. ప్రతిరోజు 4 సర్వీసులు చేస్తూ గిరిజనులకు అండగా నిలుస్తోంది. ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీసులకు గిరిజనులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

గిరిజనులకు ఉచిత బస్సు సర్వీసు
ఆ ప్రాంత గిరిజనులకు గమ్యాన్ని చేరాలంటే నిత్యం నడకే ఆధారం. కావాల్సిన చోటికి ఎప్పుడు చేరతారో తెలియని దుస్థితి. అలాంటి చోటుకు బస్సు వచ్చిందంటే పండగే. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే అధిక రుసుములతో వారి జేబులకు చిల్లులు ఖాయం. ఆ డ్రైవర్ల అతివేగానికి అప్పుడప్పుడూ ప్రమాదాల బారిన పడడం అదనం. నిత్యం మండల కేంద్రాలు, కళాశాలకు, సంతలకు వెళ్లి.. తిరిగి సొంత గూటికి చేరడం వారికి ఓ యుద్ధంతో సమానం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ సమస్యకు.. పోలీసులు పరిష్కారం చూపారు. ఉచిత బస్సు ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీర్చారు.

విశాఖ మన్యం సువిశాల కొండకోనల ప్రాంతం. గిరిజనాభివృద్ధి సంస్థ చాలా ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించినా... ఇప్పటికీ రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అధిక రుసుము వసూలు చేస్తూ జీపు సర్వీసులు నడుపుతున్నారు. ఎక్కువ సంఖ్యలో జనాలను ఎక్కించడం వల్ల ప్రమాదాల బారిన పడి.. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందులోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వ సర్వీసులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు రావో తెలియని దుస్థితి. ఈ కారణంతోనే.. ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత రవాణా సర్వీసులు మొదలు పెట్టింది పోలీసు శాఖ.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టు నుంచి కుమడ వరకు ఒక సర్వీసు, జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు మరో ఉచిత సర్వీసును నడిపిస్తున్నారు. కుమడ బస్సు ప్రారంభించి 2 వారాలు అవుతోంది. ప్రతిరోజు 4 సర్వీసులు చేస్తూ గిరిజనులకు అండగా నిలుస్తోంది. ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీసులకు గిరిజనులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Intro:ap_vsp_76_06_maoist_prabhavithamlo_police_uchitha_bus_harsham_avb_c11_pkg

శివ, పాడేరు

యాంకర్: ఆ గిరిజనులు నిత్యము నడకే జీవనం. గమ్యానికి చేరాలంటే ఎప్పుడు చెరతామో తెలియని దుస్థితి.
బస్ ఆ ప్రాంతానికి వచ్చిందంటే సంతోషమే. ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తే అధిక రుసుములు, ప్రమాద బరితమే. నిత్యం మండల కేంద్రాలు, కళాశాల, ఐటీడీఏ కు, సంతలకు వెళ్లాలంటే ప్రయాణ కష్టాలే. అటువంటి గిరిజనులకు ఆసరాగా నిలుస్తోంది విశాఖ జిల్లా పోలీసు శాఖ. ఉచిత బస్ సర్వీస్ కలిపిస్తూన్న ప సదుపాయాలు పై ప్రత్యేక కధనం.

యాంకర్: విశాఖ మన్యం సువిశాల కొండకోనల ప్రాంతం. కొండలు నడుమ గిరిజనాభివృద్ధి సంస్థ చాలా ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించినప్పటికీ రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే. ఏజెన్సీలో కిక్కిరిసిన జనాలతో అధికంగా వసూలు చేస్తూ ప్రైవేట్ జీపులు సర్వీస్ లు నడుపుతుంటారు. దీంతో చాలా సార్లు గిరిజనులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. అందులోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వ సర్వీసులు ఎప్పుడు ఉంటాయో తెలియని దుస్థితి. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత రవాణా సర్వీసులు మొదలు పెట్టింది పోలీసు శాఖ.

యాంకర్: ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ముంచంగిపుట్టు నుంచి కుమడ వరకు ఒక సర్వీసు, జిమాడుగుల నుంచి మద్దిగరువు వరకు మరో ఉచిత సర్వీసు మొదలు పెట్టారు. కుమడ బస్ సర్వీస్ ప్రారంభం చేసి రెండు వారాలు పైబడి అవుతుంది. ప్రతిరోజు నాలుగు కిలోమీటర్ల మేర సర్వీస్ చేస్తూ పోలీసులు గిరిజనులకు చేరువ అవుతున్నారు. మన్యంలో మారుమూల ప్రాంతాల్లో అసలు బస్సులు తిరగవు. మొక్కుబడిగా ఆర్టీసీ నడిపినప్పటికీ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో అసలు వస్తుందో లేదో తెలియని దుస్థితి.
బైట్,
బైట్;

యాంకర్: మావోయిస్ట్ కబంధ హస్తాలకు చిక్కకుండా పోలీసులు ఎదో విధంగా సాయం చేసి తమవంతు కృస్గి చేస్తున్నారు. పోలీసులు కల్పించిన ఉచిత బస్ సర్వీసుల పై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్: జిమాడుగుల మండలం మావోయిస్ట్ ప్రభావం కలిగిన ప్రాంతం ఎన్నో మావో హింసాత్మక సంఘటనలు ఈ ప్రాంతం మారింది. ఇంఫార్మరల నెపంతో పదుల సంఖ్యలో గిరిజనుల ను మావోయిస్టులు హతమార్చారు. అనేక దాడులకు పాల్పడి జేసీబీ, రోడ్ రోలర్ వంటి రహదారి నిర్మాణ సామాగ్రి తగులబెట్టారు. జి.మాడుగుల నుంచి మద్దిగరువు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మార్గంలో నుర్మతి, వాకపల్లి వంటి గ్రామాలు మావోయిస్ట్ ప్రభావితమ్ ఎక్కువగా ఉండేవి ఈ ప్రభావం తగ్గించేదుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
వ్
బైట్:
యాంకర్: జిమాడుగుల మద్దిగరువు మధ్య ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించారు. తొలిరోజు డీఎస్పీ రాజకమల్, సిఐ , శ్రీనివాస్, si రామారావు ఉచిత బస్ సర్వీస్ లో జిమాడుగుల నుంచి మద్దిగరువు అక్కడ నుంచి పాడేరు ఉచిత బస్ లో ప్రయానించారు.
బైట్: డీఎస్పీ, రాజకమల్
. అధిక సంఖ్యలో గిరిజనులు ఈ సేవలు వినియోగించుకునేందుకు గిరిజనులు ముందుకు వస్తూ
హర్షం వ్యక్తమ్ చేసి ధన్యవాదాలు తెలువుతున్నారు.
ముగింపు: గిరిజనులక్కు పోలీసు వారి తరపున ఏదైనా చేయడానికి తాము సిద్ధమని పోలీసులు తెలుపుతున్నారు
పీటూ సీ , శివ, పాడేరు
........


Body:శివ


Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.